బీజేపీ తెలంగాణ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా.. బీసీలకే..?

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2023 (20:48 IST)
BJP
తెలంగాణ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ప్రకటించనుంది. మొత్తం 50 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ ప్రకటించారు. అంతేకాదు ఈ 50 మందిలో 20కి పైగా స్థానాల్లో బీసీలను బరిలోకి దింపుతున్నారు. 
 
అభ్యర్థుల ఎంపికలో బీజేపీ సామాజిక న్యాయాన్ని అనుసరిస్తుందనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. సీట్ల కేటాయింపులో మహిళలు, బీసీలకు పెద్దపీట వేసినట్లు చెబుతున్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలను రాజకీయ బానిసలుగా చూస్తున్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. వాళ్ల ఓట్లు కావాలి కానీ సీట్లు ఇచ్చేది లేదని దుయ్యబట్టారు. 
 
రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రం నుంచి 50కి పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తయిందని తెలిపారు. మహిళలకు సీట్ల విషయంలో బీఆర్ ఎస్ మొసలి కన్నీరు కారుస్తోందని దుయ్యబట్టారు. 
 
మహిళల కోసం కవిత ఢిల్లీలో ధర్నాలు చేశారని, అయితే ఆ పార్టీ మహిళలకు సీట్లు ఇవ్వలేదని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మహిళలను పక్కన పెట్టాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థుల ఎంపికలో బీజేపీ సామాజిక న్యాయాన్ని అనుసరిస్తోందని వివరించారు. 
 
తొలిదశలో బీసీలకు 20కి పైగా సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.  కాంగ్రెస్ పార్టీ బీసీలను వాడుకుని వదిలేస్తోందని ఆరోపించారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన రాజాసింగ్ వ్యవహారాన్ని బోర్డు పరిశీలిస్తోందని లక్ష్మణ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments