కేసీఆర్ రిటైర్ కాకుంటే.. కేటీఆరే వెన్నుపోటు పొడుస్తాడు.. అరవింద్

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (17:08 IST)
టీఆర్ఎస్ పార్టీ పై నిజామాబాద్ ఎంపీ బీజేపీ నేత అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఎన్నికలపై ప్రస్తావిస్తూ.. బీజేపీ విజయంతో తెరాస పార్టీలో లుకలుకలు ఏర్పడుతాయని..  స్వయంగా ఆయన కొడుకు కేటీఆరే వెన్నుపోటు పొడుస్తాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
ప్రజలను,  ఓట్లను కొనుక్కునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించిదని, హుజూరాబాద్‌లో వందల కోట్లు ఖర్చు పెట్టినా… ప్రజలు తిరస్కరించారని తెలిపారు. అవినీతి, అహంకారం టీఆర్ఎస్ పార్టీ పతనావస్థకు దారి తీస్తున్నదని హెచ్చరించారు.  కేసీఆర్ శకం ముగిసిందని.. త్వరలో ఆయన రిటైర్ కావాలని లేకపోలే ప్రజలే ఆ పని చేస్తారని తెలిపారు. తెలంగాణ ప్రజలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అరవింద్ అన్నారు. బంగారు తెలంగాణ బీజేపీ, మోదీ నాయకత్వంతోనే సాధ్యం అని ఆయన స్పష్టం చేశారు. 
 
దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ గెలుపుతో తెలంగాణ ప్రజలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు స్పష్టం అవుతుందని అరవింద్ అన్నారు. తెలంగాణలో గత ఏడేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు. రానున్న రోజుల్లో అనేక మంది బీజేపీలో చేరబోతున్నారని జోస్యం చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీ అందరి ఊహలకు అందని చిత్రంగా 'రాకా' : సన్ పిక్చర్స్

ఒకరికి పుట్టినరోజు.. మరొకరికి పునర్జన్మ : పవన్ కళ్యాణ్ సతీమణి

Raaka: అల్లు అర్జున్ #AA22xA6 ఫస్ట్-లుక్ టైటిల్ ఇదే

Venkatesh: ఐదు సినిమాలు చేస్తే చాలనుకున్న నన్ను నిలబెట్టింది వారే : అడివి శేష్

Akhil: అఖిల్ అక్కినేని పుట్టినరోజున లెనిన్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం

హెచ్చరిక: అందరి దృష్టిని ఆకర్షించేలా తన లేటెస్ట్ కలెక్షన్‌ను రూపొందించిన మోచీ

UP Woman Scripts History: ఖాట్మండు నుంచి ఎవరెస్ట్ వరకు సైకిల్ యాత్ర.. దివ్య సింగ్ రికార్డ్ (video)

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

తర్వాతి కథనం
Show comments