Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్బీ నగర్‌లో కొంప ముంచిన బర్త్‌డే పార్టీ - 45 మందికి కరోనా

Webdunia
ఆదివారం, 10 మే 2020 (17:14 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్టే పట్టి.. తిరిగి పుంజుకున్నాయి. అయితే, ఈ కేసులన్నీ కేవలం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోనే నమోదవుతున్నాయి. 
 
ముఖ్యంగా ఇటీవల హైదరాబాద్ వనస్థలిపురం ఏరియాలో ఈ కరోనా వైరస్ స్వైర విహారం చేసింది. ఇక్కడ నమోదైన కేసుల్లో 45 కేసులు కేవల ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన వారే కావడం గమనార్హం. వీరందరూ ఓ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఫలితంగా వీరందరికీ ఈ వైరస్ సోకినట్టు తేలింది. 
 
ఇటీవల సరూర్ నగర్ నివాసికి మలక్‌పేట్ గంజ్‌లో ఓ దుకాణం ఉంది. అప్పటికే ఆ వ్యాపారికి తన దుకాణంలో పనిచేసే వ్యక్తి ద్వారా కరోనా సోకింది. ఈ విషయం తెలియక పార్టీలో పాల్గొనడంతో అతడి మిత్రుడికి కూడా కరోనా వ్యాప్తి చెందింది. 
 
ఆ విధంగా మొత్తం 45 మంది కరోనా బారినపడ్డట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు ఆ ప్రాంతంలో రెండు కంటైన్మెంట్ క్లస్టర్లు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య మరింత పెరిగింది. కొత్త కేసులు నమోదు కావడమే కాదు, ఎల్బీ నగర్ ఏరియాలో 15 కంటైన్మెంట్ క్లస్టర్లు కూడా ఏర్పడ్డాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments