Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత రాష్ట్ర సమితిలో విలీనమైన భూమి పుత్ర సంఘటన పార్టీ

Webdunia
సోమవారం, 8 మే 2023 (10:16 IST)
మహారాష్ట్రలోని చిన్న రాజకీయ పార్టీల్లో ఒకటైన భూమిపుత్ర సంఘటన పార్టీని ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో విలీనం చేశారు. ఆదివారం హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో బీపీఎస్ సంస్థాపక అధ్యక్షుడు సంతోష్ వాడేకర్ తన నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ సక్షమంలో వెల్లడించారు. ఆ తర్వాత ఆయనతో పాటు పార్టీ నేతలు కిరణ్ వాబాలే, అనినాశ్ దేశ్‌ముఖ్, అశోక్ అందాలే, రాజన్ రోక్డే, అసిఫ్ భాయ్ షేక్ తదితరులు బీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు. 
 
వీరితో పాటు పలు పార్టీలకు చెందిన నేతలు సైతం సీఎం సమక్షంలో భారాసలో చేరగా.. వారికి కేసీఆర్‌ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్‌ నేత సమాధాన్‌ అర్నికొండ, ఆప్‌ పార్టీ నేత దీపక్‌ కొంపెల్వార్‌, యోగితా కొంపెల్వార్‌, రాము చౌహాన్‌, భారీ త్రిలోక్‌ జైన్‌, సంతోష్‌ కాంబ్లేలు భారాసలో చేరారు. 
 
అఖిల భారతీయ క్రాంతి దళ్‌ సంఘటన నేత లక్ష్మీకాంత్‌, గణేశ్‌, సంతోష్‌ గౌర్‌ల ఆధ్వర్యంలో గంగాధర్‌ మహారాజ్‌ కురుంద్కర్‌, గణేశ్‌ మహారాజ్‌ జాదవ్‌లు భారాసలో చేరారు. నిఖిల్‌ దేశ్‌ముఖ్‌ ఆధ్వర్యంలో గోండ్వానా పార్టీకి విదర్భ అధ్యక్షులు ప్రణీత వికేసీ, యావత్మాల్‌కు చెందిన సామాజిక కార్యకర్త వర్ష కాంబ్లే, విదర్భకు చెందిన మహిళా బచత్‌ గాట్‌ మహిళా కమిటీ అధ్యక్షురాలు కల్పన, పూనమ్‌ అలోర్‌లు భారాసలో చేరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments