తీవ్ర తుఫానుగా మారిన మోచా... శ్రీలంక వద్ద ఏర్పడిన ఆవర్తనం

Webdunia
సోమవారం, 8 మే 2023 (10:04 IST)
దక్షిణ తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ఆవర్తనం సోమవారం ఉదయంలోగా అల్పపీడనంగా మారనుందని, ఇది ఈ నెల తొమ్మిదో తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని గోపాల్‌పూర్ వాతావరణ అధ్యయన కేంద్రం తెలిపింది. ఇదే విషయంపై ఆ కేంద్ర అధికారి ఉమాశంకర్ దాస్ మాట్లాడుతూ, ఈ నెల పదో తేదీన వాయుగుండం తుఫానుగా మారనుండగా, దీనికి యెమెన్ దేశం మోచాగా నామకరణం చేసిందని తెలిపారు. 
 
ఈ తుఫాను తీవ్రరూపం దాల్చుతుందని అంచనా వేసినట్టు చెప్పారు. 9వ తేదీన ఉత్తర దిశగా కేంద్ర బంగాళాఖాతంలో ప్రవేశించి ఆ తర్వాత ఏ దిశగా కదులుతుందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదన్నారు. మంగళవారానికి దీనిపై పూర్తి వివరాలు వెల్లడించగమని చెప్పారు. 
 
అందువల్ల రాష్ట్రంలోని ఓడరేవులకు ఇంతవరకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని తెలిపారు. సముద్రంలో ట్రాలర్లు, మరబోట్లు ద్వారా చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు వీలైనంత త్వరగా ఒడ్డుకు చేరుకోవాలని కోరారు. 
 
మరోవైపు విదేసీ వాతావరణ అధ్యయన సంస్థలు కూడా మోచా తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని ఇది మయన్మార్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని, ఈ తుఫాను ప్రభావం కారణంగా ఒడిశాకు పెను ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments