Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''మోచా'' తుఫాను ముంచుకొస్తోంది.. జాగ్రత్త.. ఐఎండీ హెచ్చరిక

cyclone
, శనివారం, 6 మే 2023 (19:03 IST)
ఏపీ ప్రజలను మరో తుఫాను భయపెడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మోచాగా మారే అవకాశం వుందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. ఈ తుఫాను, గమనం, తీవ్రత అనిశ్చితంగానే ఉన్నాయి. ఇది అధికారులలో ఆందోళన కలిగిస్తోంది. 
 
IMD యొక్క ట్విట్టర్ ఖాతా ప్రకారం, ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. మే 8 నాటికి అల్ప పీడన ప్రాంతం (LPA) ఏర్పడుతుందని అంచనా వేయబడుతోంది. ఇది దాదాపు మే 9 నాటికి ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. 
 
ఈ తుఫాను కారణంగా చెన్నై, దాని శివారు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాష్ట్రంలోని కోస్తా జిల్లాలకు అలర్ట్ జారీ చేయడంతో తమిళనాడు అప్రమత్తమైంది. 
 
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి, IMD రెండు తెలుగు రాష్ట్రాలను, ముఖ్యంగా కోస్తా, రాయలసీమ జిల్లాలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రవాణా, పంటలపై తుఫాను ప్రభావం అధికంగా వుంటుందని తెలుస్తోంది. 
 
మోచా తుఫానుతో ప్రజలు అప్రమత్తంగా వుండాలని.. అవసరమైన సామాగ్రిని నిల్వ చేసుకోవాలని, వారి ఇళ్లను సురక్షితంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు. రైతులు, గ్రామీణ సంఘాలు కూడా తమ జీవనోపాధి, ఆస్తులను కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలని వారు చెప్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకేశాడు... ఆపినా ఆగలేదు..