Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్‌లో బాసర అక్షరాభ్యాసం టికెట్లు.. ధర ఎంతంటే...

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (14:22 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర ఆలయంలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు తల్లిదండ్రులు అమితాసక్తి చూపుతుంటారు. ఈ అక్షరాభ్యాసం టిక్కెట్ల కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా ఈ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించేలా బాసర దేవస్థాన అధికారులు చర్యలు తీసుకున్నారు. 
 
ఇందులోభాగంగా, ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయించనున్నారు. ఒక్కో టిక్కెట ధర రూ.1,516గా ఖరారు చేశారు. విదేశీయులకు అయితే, రూ.2,516గా నిర్ణయించారు. అలాగే, అమ్మవారికి పూజ చేసిన వస్తువులను కూడా పోస్టు ద్వారా పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంలో భక్తుల రద్దీ నానాటికీ పెరిగిపోతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
సాధారణంగా బాసర ఆలయంలో చిన్నారులను పాఠశాలలకు పంపించే ముందు అక్షరాభ్యాసం చేయించేందుకు దేశం నలుమూలల నుంచి తల్లిదండ్రులు ఈ ఆలయానికి వస్తుంటారు. నిత్యం వందలాది మంది భక్తులు ఆలయ సందర్శనకు వస్తుంటారు. ఏటా దాదాపు 80 వేల నుంచి లక్ష మంది పిలలకు బాసర ఆలయ ప్రాంగణంలో అక్షరాభ్యాసం జరుగుతుంది. దీంతో భక్తుల రద్దీ కూడా పెరిగిపోతోంది. క్యూలైన్లలో భక్తులు ఇబ్బందులు పడుతుండటంతో అక్షరాభ్యాసం టికెక్టలను దేవాదాయ శాఖ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చింది. అక్షరాభ్యాసం కోసం ఆన్‌లైన్‌లో టిక్కెట్ బుక్ చేసుకుంటే రూ.1516 చెల్లించాల్సి ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments