బాసర ట్రిపుల్ ఐటీలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలు

Webdunia
ఆదివారం, 19 జూన్ 2022 (13:00 IST)
తెలంగాణాలోని ట్రిపుల్ ఐటీ బాసరలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులు, అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వెళ్లిన మంత్రి హరీష్ రావు కాన్వాయ్‌ను విద్యార్థి సంఘానే నేతలు అడ్డుకున్నారు. 
 
నిజానికి ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల ప్రతినిధులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం ఆయన అధికారిక ప్రకటన చేస్తూ చర్చలు సఫలం అంటూ పేర్కొన్నారు. కానీ, విద్యార్థి సంఘాల నేతలు మాత్రం చర్చలు విఫలం అంటూ ట్వీట్ చేశారు. దీంతో విద్యార్థుల ఆందోళన ముగియలేదు కదా మరింత ఉధృతంగా కొనసాగిస్తున్నారు. 
 
పైగా, తాము చేస్తున్న 12 డిమాండ్లలో ఏ ఒక్క డిమాండ్‌పై కూడా మంత్రులు స్పష్టత ఇవ్వలేదని విద్యార్థులు ప్రకటించారు. హామీ పత్రం విడుదల చేసిన మరుక్షణమే ఆందోళన విరమిస్తామని విద్యార్థులు ప్రకటించారు. మరోవైపు, తెలంగాణ మంత్రులకు వరుసగా సెగలు తగులుతున్నాయి. 
 
నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి హరీష్ రావుకు నిరసన సెగ తగిలింది. ఈయన కాన్వాయ్‌ను విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. బాసర ట్రిపుల్ ఐటీపై స్పందించాలని ఆయన్ను విద్యార్థులు డిమాండ్ చేశారు. మరోవైపు, మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐటీ ఉద్యోగాలు వదిలి హీరోయిన్లు అయ్యారు

Peddi: ఆరు రోజుల్లో పెద్ది షూటింగ్ పూర్తి - ఐటెంసాంగ్ లో సంయుక్త మీనన్ !

Nagababu: CASTE మూవీ నుంచి రంగరాజన్ గా నాగబాబు లుక్

బెల్లంకొండ గణేష్, ఎ. కరుణాకరన్ కాంబినేషన్ లో రొమాంటిక్ కామెడీ చిత్రం

Vishwak Sen: థాయ్‌లాండ్‌లో విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ ల ఈఎన్ఈ రిపీట్ షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్

గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

తాజా పిండి: ఆధునిక వంటగదులకు సాంప్రదాయ పిండి రుబ్బే పద్ధతిని తెస్తున్న సాఫ్టెల్

అక్షయ తృతీయ ప్రచారంతో కృతిశెట్టితో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ప్రకటించిన ఇంద్రియ

హైదరాబాద్‌లో తొలిసారిగా జరిగిన ది లీలా మొజాయిక్ 2026కి విశేష స్పందన

తర్వాతి కథనం
Show comments