Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంచికచర్లలో బంద్ ప్రశాంతం

Webdunia
మంగళవారం, 8 డిశెంబరు 2020 (16:53 IST)
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష రైతు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఇచ్చిన భారత్ బంద్లో భాగంగా మంగళవారం కంచికచర్లలో సిపిఎం సిఐటియు ప్రజాసంఘాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా జరిగింది.

బందులో పలు కార్మిక సంఘాలతో పాటు లారీ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సిఐటియు కార్యాలయం వద్ద నుండి నాయకులు కార్మికులు రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, నరేంద్రమోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ జాతీయ రహదారిపై ప్రదర్శన చేశారు. చెవిటికల్లు రోడ్డు సెంటర్ బంకు సెంటర్ నెహ్రూ సెంటర్ మధిర రోడ్డులో ప్రదర్శన సాగింది.

రైతులకు మద్దతుగా చేపట్టిన బంద్ కు కంచికచర్లలో అన్ని వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి రైతాంగ వ్యతిరేక చట్టాలు యాక్ట్ 2020  20 చట్టాలను రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి జి హరికృష్ణ రెడ్డి నాయకులు లంకోజి నాగమల్లేశ్వరరావు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం సోమేశ్వర రావు యుటిఎఫ్ నాయకులు నాగేశ్వరరావు సిఐటియు నాయకులు బెజ్జం భూషణం కాశిబోయిన రాంబాబు బడేటి దాసు కంభంపాటి శ్రీను అమర్లపూడి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్టారు రవి దేవరకొండ శ్రీను జయరాజు లారీ ఓనర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు పెద్దమల్ల భద్రయ్య కార్యవర్గ సభ్యులు రామారావు తాటికొండ వీరయ్య పోలిశెట్టి శ్రీను పంచాయితీ, బిల్డింగ్,ఆశ,ఆటో, ముఠా మరోయి వివిధ రంగాల కార్మికులు బంద్ లో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments