బోధన్‌ బంద్‌కు బీజేపీ పిలుపు: 170 మంది ముందస్తుగా అరెస్ట్

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (15:34 IST)
బోధన్‌ బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. సోమవారం బీజేపీ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బోధన్‌లో ప్రత్యేక పోలీసు బలగాలు రంగంలోకి దించారు. ఈ సందర్భంగా సీపీ నాగారాజు మాట్లాడుతూ.. బోధన్ లో ప్రశాంతంగా బంద్‌ కొనసాగుతోందన్నారు.
 
నిన్నటి ఆందోళనకు సంబంధించి 10 మంది అరెస్ట్‌ చేసినట్లు ఆయన వెల్లడించారు. బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో 170 మందిని ముందస్తు అరెస్ట్ చేశామని, బోధన్ పట్టణంలో 144 సెక్షన్ కొనసాగుతోందని ఆయన వివరించారు. 
 
నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్‌లో నిన్న ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని శివసేన, బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు. దీనిపై ఒక వర్గం నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో పరస్పరం రాళ్ల దాడులకు దిగారు. 
 
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జి చేసి, టీయర్ గ్యాస్ ను కూడా వదిలారు. దీంతో ఆందోళన కారులు అక్కడినుంచి వెళ్లిపోయారు. నిన్నటి ఘటనలో అరెస్ట్ అయిన వారిపై నాన్ బెయిలబుల్ కేసు నమోద చేసినట్లు ఆయన పేర్కొన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ 10 సీజన్‌లో అడుగుపెట్టాలని వుంది, నన్ను సెలక్ట్ చేయండి: నంద్యాల ఎస్ఐ సెల్ఫీ వీడియో

OG2 : తుఫాను రాకముందు.. ఒక నిశ్శబ్ద క్షణం అంటూ.. ఓజీ 2 అప్ డేట్

Samantha career over : స‌మంత కెరీర్‌ అయిపోయింద‌న్నారు, క‌రెక్టేనేమో అనిపించింది : స‌మంత‌

వందేమాతరం శ్రీనివాస్ కుమారుడు సుస్వర తరంగ్ హీరోగా చిత్రం

పెద్దలను ఎదిరించి ప్రియుడిని పెళ్లాడిని జబర్దస్త్ ఫైమా

తర్వాతి కథనం
Show comments