Webdunia - Bharat's app for daily news and videos

Install App

థియేటర్లను మూతవేసేది లేదు.. థియేటర్ల మీద ఆంక్షలపై సర్కారు క్లారిటీ

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (21:52 IST)
సంక్రాంతికి పెద్ద సినిమాలు విడుదల కావాల్సి వున్న నేపథ్యంలో సినీ ప్రముఖులు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ని కలిశారు. డిసెంబరులో పలు చిత్రాలు విడుదల కానున్నాయి. 
 
ఈ సమావేశంలో నిర్మాతలు దిల్ రాజు, దానయ్యలతో పాటు దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, థియేటర్లలో ఆంక్షలు అంటూ జరుగుతున్న ప్రచారం తదితర అంశాలపై వారు మంత్రితో చర్చించారు. 
 
ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లోనూ ప్రవేశించిందన్న వార్తలతో సినీ రంగం ఆందోళన చెందుతోంది. దీనికి స్పందించిన మంత్రి త‌ల‌సాని థియేటర్లను మూతవేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. 
 
థియేట‌ర్ల‌కు వెళ్ళి ధైర్యంగా సినిమా చూడండ‌ని చెప్పారు. థియేట‌ర్ల మూత‌, ఆక్యుపెన్సీ త‌గ్గింపు ప్ర‌చారాన్ని న‌మ్మొద్ద‌ని తెలిపారు. అలాంటి ఆలోచ‌న‌లు ప్ర‌భుత్వానికి లేవ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments