Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూల్‌డ్రింక్ అనుకుని పురుగుల మందు సేవించిన చిన్నారి

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2022 (14:24 IST)
ఓ ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కూల్‌డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగింది. దీంతో అపస్మారకస్థితిలోకి జారుకుంది. బాలికను గుర్తించి ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన ఆసిఫాబాద్ మండలం భీంపూర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భీంపూర్ గ్రామానికి చెందిన రాజేశ్, లావణ్య దంపతులకు శాన్వి గుండి అనే ఐదేళ్ళ బాలిక వుంది. ఈ చిన్నారి స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు స్కూల్‌లు ఎల్కేజీ చదువుతోంది. ఆదివారం సెలవు కావడంతో పెద్దనాన్న ఇంటిలో ఆట్లాడుకుంటోంది. 
 
ఆ సమయంలో తన కంటికి కనిపించిన ఓ బాటిల్‌లోని ద్రావకాన్ని తాగేసింది. అయితే, కూల్‌డ్రింక్ అని భావించి ఆ చిన్నారు తాగేసింది. దీంతో ఆ బాలిక అపస్మారక స్థితిలోకి చేరుకుంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. తమ బిడ్డను బతికించుకునేందుకు తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments