Webdunia - Bharat's app for daily news and videos

Install App

నుపుర్ శర్మను ఉరితీయాలి.. ఆ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదు.. అసదుద్ధీన్ ఓవైసీ

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (09:13 IST)
ఏఐఎమ్ఐఎమ్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ గత శుక్రవారం నుపుర్ శర్మను ఉరితీయాలంటూ చేసిన కామెంట్లు వివాదాస్పదమైనాయి. ఈ వ్యాఖ్యలపై ఏఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల నేపథ్యంలో నుపుర్ శర్మను ఉరితీయాలన్న సొంత ఎంపీ అభిప్రాయంతో తమ పార్టీకి సంబంధం లేదన్నారు. 
 
''దేశంలోని చట్టాల ప్రకారమే నుపుర్ శర్మను అరెస్టు చేయాలి. చట్ట ప్రకారమే ఆమెను శిక్షించాలి. ఈ విషయంలో ఇదే మా పార్టీ వైఖరి. పార్టీలోని నేతలు అందరూ దీన్ని అంగీకరించాలి. ఇంతియాజ్ వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదు'' అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. 
 
మరోవైపు ఇంతియాజ్ వ్యాఖ్యలను శివసేన కూడా ఖండించింది. ఆ పార్టీ నాయకురాలు, ఎంపీ ప్రియాంకా చతుర్వేది మాట్లాడుతూ ''ఇంతియాజ్ వ్యాఖ్యలు సిగ్గుచేటు. వీటిని ఖండించాలి. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిగా ఇలాంటి సందర్భంలో రెచ్చగొట్టే బదులు శాంతియుతంగా, సంయమనంతో ఉండాల్సింది'' అని ప్రియాంకా చతుర్వేది ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments