Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, వర్షాలు ఇప్పట్లో తగ్గబోవు- వాతావరణశాఖ

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (12:33 IST)
తెలుగు రాష్ట్రాలలో భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 20వ తేదీన ఆదివారం నాడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నదని, ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు తోడు, కొత్త అల్పపీడనం కారణంగా ఏర్పడే పరిస్థితులు కలిసి, మరిన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలియజేసింది.
 
ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడినా, ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాదులో నిత్యమూ ఏదో ఒక సమయంలో భారీ వర్షం కాసేపు పలకరిస్తూనే ఉంది.
 
ఇక రాగల 48 గంటల్లో ఉమ్మడి అదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లా నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లా ఒకటి రెండుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలకు అవకాశం ఉందని హైదరాబాదు వాతావరణశాఖ హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments