Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నా చెల్లెళ్లు ప్రేమించుకున్నారు.. చివరకు ప్రాణాలు తీసుకున్నారు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (10:52 IST)
వారిద్దరూ వరుసకు అన్నా చెల్లెళ్లు అవుతారు. కానీ, ప్రేమించుకున్నారు. ఈ విషయం బయటకు తెలిసింది. మంచి పద్దతి కాదంటూ పెద్దలు హెచ్చరించారు. దీంతో తామిద్దరం కలిసివుండటం సాధ్యం కాదనుకున్నారు. దీంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన తెలంగాణా రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా కృష్ణ మండల పరిధిలోని చేగుంట - కృష్ణ రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం దానాల, పర్లాపల్లి గ్రామాలకు చెందిన 70 కుటుంబాలు పత్తి చేలలో పని చేసేందుకు తెలంగాణాలోని చేగుంటకు వలస వచ్చాయి. అక్కడే తాత్కాలిక గుడారాలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఈరమ్మ - మున్నెల్ల దంపతులకు మణికుమార్ (25) అనే కుమారుడు ఉండగా, శాంతమ్మ - కేశవల కుమార్తె అనిత (15)లు వరుసకు అన్నా చెల్లెళ్లు అవుతారు. ఈ విషయం వారికి స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ వారిద్దరూ గత కొద్దిరోజులుగు ప్రేమించుకుంటున్నారు. 
 
ఈ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలిసింది. వారు ఇది మంచి పద్దతి కాదని హెచ్చరించారు. అప్పటి నుంచి వారు ఒకరినొకరు విడిచి ఉండటం సాధ్యం కాదని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 
 
ఈ క్రమంలో శనివారం అర్థరాత్రి సమయంలో వారిద్దరూ కలిసి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లారు. ఆ తర్వాత అనిత పట్టాల మధ్య తన చున్నీ పరవగా వారిద్దరూ దానిపై పడుకున్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన రైలు ఒకటి వారిపై దూసుకెళ్లడంతో వారిద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments