మత్తు మందు ఇచ్చి దాడి.. 14 ఏళ్ల బాలిక మృతి.. 70మంది వద్ద విచారణ

Webdunia
శుక్రవారం, 14 ఆగస్టు 2020 (10:56 IST)
14 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. ఆశ్రమ నిర్వాహకుడే ఈ దారుణానికి పాల్పడ్డాడు. మత్తు మందు ఇచ్చి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడటంతో బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణానికి వార్డెన్ కూడా సహకరించాడు. ఈ ఘటనకు సంబంధించి చేస్తోన్న విచారణలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. మరో మైనర్ బాలికపై సైతం నిందితుడు వేణుగోపాల్ లైంగికదాడి పాల్పడినట్లు సమాచారం. 
 
దీనిపై కుటుంబ సభ్యులు నిలదీయడంతో నిర్వాహకులు బెదిరింపులకు తెగబడినట్లు తెలుస్తోంది. సంగారెడ్డి చైల్డ్ వెల్ఫేర్ సభ్యురాలితో నిందితులకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలి సహకారంతో వీరు అక్రమాలకు తెగబడినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ సమయంలో రెస్కూ చేసిన మైనర్లను ఇక్కడికే పంపాలని సిబ్బందిపై ఒత్తిడి చేశారని సమాచారం. 
 
ఈ ఘటనపై వేసిన హైపవర్ కమిటీ విచారణలో ఈ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో అనాధ ఆశ్రమంలోని 70మందిని అధికారులు విచారించనున్నారు. రాష్ట్రంలోని ఇతర అనాధ ఆశ్రమాలలో సైతం తనిఖీలకు అధికారుల ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 400 అనాధ ఆశ్రమాలు, 19వేల మంది అనాధలు ఉన్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం