Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (20:10 IST)
కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫోటో ముద్రించాల‌ని తెలంగాణా రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పార్లమెంట్ లో ఈ అంశాన్ని లేవనెత్తాల‌ని, టీ.ఆర్.ఎస్. ఎంపీలకు బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు. కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి ప్రతినిధుల విజ్ఞప్తిపై ఆయ‌న ఇలా స్పందించారు.

కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ కమిటీ ప్రతినిధులు శుక్రవారం మంత్రుల నివాసంలో వినోద్ కుమార్ తో సమావేశమయ్యారు. తమ డిమాండ్ కు మద్దతు ఇవ్వాలని వినోద్ కుమార్ ను కోర‌గా, ఈ డిమాండ్ న్యాయ సమ్మతమైనదేనని అన్నారు.

ఈ అంశాన్ని పార్లమెంటు వేదికగా లేవనెత్తాలని టీ.ఆర్.ఎస్. పార్టీ ఎంపీలకు ఆయన సూచించారు. దేశంలో రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ అని, అలాంటి మహానీయున్ని గౌరవించుకోవడం కనీస బాధ్యత అని ఆయన అన్నారు. కమిటీ చేపట్టిన ఆగస్టు 3,4,5 తేదీలలో " చలో ఢిల్లీ " వాల్ పోస్టర్ ను ఆయన ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ కమిటీ జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురాం, నాయకులు స్వామి, నర్సింహులు, ఆశీర్వాదం, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments