కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (20:10 IST)
కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫోటో ముద్రించాల‌ని తెలంగాణా రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పార్లమెంట్ లో ఈ అంశాన్ని లేవనెత్తాల‌ని, టీ.ఆర్.ఎస్. ఎంపీలకు బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు. కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి ప్రతినిధుల విజ్ఞప్తిపై ఆయ‌న ఇలా స్పందించారు.

కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ కమిటీ ప్రతినిధులు శుక్రవారం మంత్రుల నివాసంలో వినోద్ కుమార్ తో సమావేశమయ్యారు. తమ డిమాండ్ కు మద్దతు ఇవ్వాలని వినోద్ కుమార్ ను కోర‌గా, ఈ డిమాండ్ న్యాయ సమ్మతమైనదేనని అన్నారు.

ఈ అంశాన్ని పార్లమెంటు వేదికగా లేవనెత్తాలని టీ.ఆర్.ఎస్. పార్టీ ఎంపీలకు ఆయన సూచించారు. దేశంలో రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ అని, అలాంటి మహానీయున్ని గౌరవించుకోవడం కనీస బాధ్యత అని ఆయన అన్నారు. కమిటీ చేపట్టిన ఆగస్టు 3,4,5 తేదీలలో " చలో ఢిల్లీ " వాల్ పోస్టర్ ను ఆయన ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ కమిటీ జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురాం, నాయకులు స్వామి, నర్సింహులు, ఆశీర్వాదం, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments