ఉస్మానియా విద్యార్థుల ఆకలి తీర్చిన అమ్మ అల్లం పద్మ ఇకలేరు

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (23:29 IST)
Padma
ఉస్మానియా విద్యార్థుల ఆకలి తీర్చి అమ్మల సంఘం అధ్యక్షురాలిగా కొనసాగిన అల్లం పద్మ అస్వస్థతతో కన్నుమూశారు. గత 24 ఏళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో జీవన్మరణ పోరాటం చేస్తూనే అప్పట్లో ఉద్యమంలో, ఇప్పటికీ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చిన ఆమె గత 20 రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ మీడియా అకాడమీ అధ్యక్షులు అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ.
 
ప్రధానంగా ఉస్మానియాలో ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం ఎగిసిపడుతున్న సమయంలో మెస్ లు కూడా మూసేసి ఉద్యమాన్ని అణిచివేయాలని చూసిన సమైక్య పాలకులకు ఆ విద్యార్థుల ఆకలి తీర్చి ధీటైన సమాధానం చెప్పి ఎందరో విద్యార్థులకు ఆకలి తీర్చారు. జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు అల్లం పద్మ అంత్యక్రియలు జరుగుతాయి.
 
అమ్మ అస్తమయంతో తెలంగాణ సమాజం విషాదంలో మునిగిపోయింది. తెలంగాణ మీడియా అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dr. Rajasekhar: చిరంజీవి తో నటిస్తా - రాజకీయాలంటే నో - యాక్సిడెంట్ అయ్యాకే సక్సెస్ : డా. రాజశేఖర్‌

Peddi Update: రామ్ చరణ్ చిత్రం పెద్ది పై రెండు తాజా అప్ డేట్స్ ?

Samantha: రుద్ర కాల ప్రేక్షకుల మనసు దోచుకోవాలి : సమంత

Kiran: తిమ్మరాజుపల్లి టీవీ ఎక్కడా బోర్ కొట్టదు. బెంచ్ మార్క్ అవుతుంది - కిరణ్ అబ్బవరం

MS Raju: ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో డివైన్ థ్రిల్లర్ గా అగధ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ పుచ్చకాయ తింటే తలనొప్పి వస్తుంది, ఎందుకని?

సింహాలకు మనిషి వెన్ను చూపిస్తే వేటాడుతాయా? ఎదురుగా ముఖం చూపిస్తే పారిపోతాయా?, వీడియో

పుచ్చకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

మోచేతుల కింద నలుపు రంగు వదిలించుకునేదెలా?

కాహోకాన్ 2026 యొక్క 10వ ఎడిషన్‌ను ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

తర్వాతి కథనం
Show comments