Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ భయం నేరస్థుల్లో కలిగించాం.. తెలంగాణ వ్యాప్తంగా 6% తగ్గిన నేరాలు: డీజీపీ

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (21:17 IST)
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వార్షిక నేర నివేదికను డీజీపీ మహేందర్‌ రెడ్డి విడుదల చేశారు. ఫంక్షనల్‌ వర్టికల్‌ సిస్టం అమలు ద్వారా పోలీసుల పనితీరు మెరుగుపరిచినట్లు ఆయన వివరించారు. ప్రజలకు మరింత సులువుగా అందుబాటులో ఉండేలా సామాజిక మాధ్యమాలు వాడుతున్నట్లు పేర్కొన్నారు.
 
‘నేరం చేస్తే దొరికిపోరతామనే భయం నేరస్థుల్లో కలిగించాం. స్మార్ట్‌ పోలీసింగ్‌ ద్వారా సేవలు మరింతగా అందుబాటులోకి తెచ్చాం. నేర రహిత, మావోయిస్టు రహిత తెలంగాణ లక్ష్యాల సాధన దిశగా అడుగులు వేస్తున్నాం. రాష్ట్రంలోకి మావోయిస్టుల పునఃప్రవేశాన్ని పోలీసుల సమష్టి కృషితో అడ్డుకున్నాం. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ పూర్తిగా విజయవంతమైంది. లాక్‌డౌన్‌ సమయంలో పోలీసులు అందించిన సేవలను జనం ప్రశంసించారు’ అని డీజీపీ పేర్కొన్నారు.
 
అన్ని రకాల నేరాలు తగ్గాయి..
‘గతేడాదితో పోలిస్తే దాదాపు అన్ని రకాల నేరాలు తగ్గాయి. రాష్ట్రవ్యాప్తంగా నేరాలు 6 శాతం తగ్గాయి. హత్యలు 8.5 శాతం, మహిళలపై నేరాలు 1.9 శాతం, రహదారి ప్రమాదాలు 13.9 శాతం, వైట్‌కాలర్‌ నేరాలు 42 శాతం తగ్గాయి. 48.5 శాతం మంది నేరస్థులకు శిక్ష పడింది. ఈ ఏడాది ఎదురుకాల్పుల్లో 11 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇద్దరు రాష్ట్ర కమిటీ సభ్యులు సహా 135 మంది మావోయిస్టులు లొంగిపోయారు’ అని డీజీపీ వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments