Webdunia - Bharat's app for daily news and videos

Install App

4 రాష్ట్రాల్లో పేలుళ్ళకు ప్లాన్ - భారీగా పేలుడు పదార్థాలతో నలుగురి అరెస్టు

Webdunia
గురువారం, 5 మే 2022 (19:33 IST)
తెలంగాణ రాష్ట్రంతో సహా నాలుగు రాష్ట్రాల్లో భారీ పేలుళ్ళకు కుట్ర పన్నిన నలుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన ఉగ్రవాదులు ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా గుర్తించారు. 
 
హర్యానా రాష్ట్రంలోని టోల్ ప్లాజ్ వద్ద అనుమానిత కారులో తనిఖీలు చేయగా, అందులో భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో థర్టీ కాలిబర్ పిస్టళ్లు, ఐఈడీలు, ఆర్డీఎక్స్ తదితర వస్తువులు ఉన్నాయి. 
 
కారులోని నలుగురు ఖలిస్థాన్ ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ, పంజాబ్, హర్యానా పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. అరెస్టు చేసిన ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ ఆయుధాలను మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments