Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుజరాత్ టైటాన్స్‌ దూకుడుకు పంజాబ్ బ్రేక్

punjab team
, బుధవారం, 4 మే 2022 (08:51 IST)
ఐపీఎల్ 15 సీజన్ పోటీల్లో వరుస విజయాలతో దూసుకునిపోతున్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు బ్రేక్ పడింది. గుజరాత్ దూకుడుకు పంజాబ్ బ్రేక్ వేసింది. మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ నిర్దేశించిన లక్ష్యాన్ని పంజాబ్ జట్టు కేవలం 2 వికెట్లు కోల్పోయి 16 ఓవర్లలోనే సాధించింది. దీంతో గుజరాత్ జట్టు ఓటమిని చవిచూసింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టుకు ఏమాత్రం కలిసిరాలేదు. పంజాబ్ బౌలర్ కగిసో రబడ గుజరాత్ అటగాళ్ళు పరుగులు చేయలేక పోయారు. రబడ నిప్పులు చెరుగుతూ బంతులు విసిరాడు. దీంతో ఒక్కొక్కరుగా పెవిలియన్‌కు క్యూకట్టారు. కానీ, సాయి సుదర్శన్ మాత్రం ఆ జట్టుకు ఆపద్బాంధవుడుగా నిలిచి 50 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 65 పరుగుులు చేయడమే కాకుండా అజేయంగా నిలిచాడు. దీంతో గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత 144 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు అలవోకగా విజయాన్ని అందుకుంది. ఓపెనర్ జోస్ బట్లర్ (1) వికెట్లను త్వరగా కోల్పోయినప్పటికీ శిఖర్ ధావన్ - భానుక రాజపక్స జోడీ 87 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 28 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో రాజపక్స 40 పరుగులు చేశాడు. 
 
ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన లివింగ్ స్టోన్ అండగా నిలబడటంతో శిఖర్ ధావన్ మిగిలిన పనిని పూర్తి చేశాడు. శిఖర్ ధావన్ మొత్తం 53 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 62 పరుగులు చేయగా, స్టోన్ 10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేశాడు. ఫలితంగా 16 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన పంజాబ్ జట్టు విజయభేరీ మోగించింది. నాలుగు వికెట్లు తీసిన రబడకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోల్‌కతా వరుస పరాజయాలకు బ్రేక్ - ఓడిన రాజస్థాన్