Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరువు కోసం కన్నబిడ్డనే కడతేర్చాడు.. ప్రేమకు వద్దన్నాడు.. ఒప్పుకోకపోవడంతో?

Webdunia
శనివారం, 28 మే 2022 (11:34 IST)
తెలంగాణలో పరువు హత్యలు పెరిగిపోతున్నాయి. మనుషుల ప్రాణాల కంటే కులాలకు విలువనిచ్చే మృగాల సంఖ్య పెరిగిపోతోంది. పరువు కోసం కన్నబిడ్డల్ని పొట్టనబెట్టుకుంటున్నారు. తాజాగా ఆదిలాబాద్‌ జిల్లాలో పరువు కోసం ఏకంగా కూతురి ప్రాణాలనే తీశాడో తండ్రి. 
 
వేరే మతానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుందన్న కోపంతో.. గొంతు కోసి చంపేశాడు. ఇన్నేళ్లు ప్రేమగా పెంచి, మమకారం పంచిన తండ్రే.. పరువు కోసం కర్కోటకుడిగా మారాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురిని పెంచిన చేతులతోనే చంపేశాడు. 
 
వివరాల్లోకి వెళితే నార్నూరు మండలం నాగల్ కొండ గ్రామానికి చెందిన రాజేశ్వరి, అదే గ్రామానికి చెందిన షేక్ అలీంను ప్రేమించింది. అయితే పెళ్లికి రాజేశ్వరి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ప్రేమికులు ఇద్దరూ మూడు నెలల క్రితం పారిపోయి పెళ్లి చేసుకున్నారు. 
 
ఇటీవలే వారిద్దరూ తిరిగి గ్రామానికి వచ్చారు. దీంతో రాజేశ్వరి తండ్రి గామంలో పంచాయితీ పెట్టాడు. కొద్ది రోజుల వరకు విడివిడిగా ఉండాలని పెద్దలు చెప్పడంతో.. ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. దీంతో పాటు షేక్‌ అలీంను మరచిపోవాలని దేవదాస్.. కూతురు రాజేశ్వరిని హెచ్చరించాడు. 
 
అందుకు ఆమె నిరాకరించడంతో కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. విచారణలో దేవదాస్ నేరం అంగీకరించడంతో.. నార్నూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments