Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఆర్టీసీ ఎండీ కీలక నిర్ణయం - టిక్కెట్లపై 20 శాతం రాయితీ

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (11:42 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ ఆర్టీసీ ఎండీ బాధ్యతలు చేపట్టిన సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తన మార్క్‌తో విధులు నిర్వహిస్తున్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి నడిపించేందుకు అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 
 
హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ పుస్తక ప్రదర్శన జరుగుతోంది. దీన్ని అధిక సంఖ్యలో నగర వాసులు సందర్శించేలా ఆయన కీలక ప్రకటన చేశారు. విజ్ఞానాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో రూ.100 టిక్కెట్‌పై 20 శాతం రాయితీని ప్రకటిస్తున్నట్టు సజ్జనార్ తెలిపారు. 
 
నగరంలో 24 గంటల టిక్కెట్‌పై ఈ నెల 27వ తేదీ వరకు తగ్గింపు పొందవచ్చని ఆర్టీసీ ఎండీ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, నగరంలో 24 గంటల పాటు చెల్లుబాటు అయ్యేలా రూ.100 టీ24 టిక్కెట్ కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుందటూ ఆర్టీసీ వెల్లడించింది. ఈ ఆఫర్‌ను నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తిచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments