Webdunia - Bharat's app for daily news and videos

Install App

గచ్చిబౌలి టిమ్స్‌ ఆస్పత్రిలో కరోనా మరణమృదంగం .. ఒక్క రోజే...

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (11:28 IST)
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ఆస్పత్రిలో కరోనా వైరస్ మరణ మృదంగం సృష్టిస్తోంది. ఈ ఆస్పత్రిలో ఒక్క రోజే ఏకంగా 20 మంది వరకు మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో భయానకపరిస్థితులు నెలకొనివున్నాయి. 
 
మరోవైపు, తెలంగాణలో కరోనా వైరస్ చెలరేగిపోతోంది. ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కేసుల సంఖ్య కూడా దారుణంగా పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో కూడా 6 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులు పెద్ద ఎత్తున మరణిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. రెండు రోజుల వ్యవధిలోనే 38 మృత్యువాత పడ్డారు. బుధవారం 18 మంది రోగులు మృతి చెందగా, గురువారం 20 మంది మరణించినట్టు టిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇషాన్ అహ్మద్ తెలిపారు. 
 
అయితే, ఇలా మరణిస్తున్న వారిలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారే ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. కాగా, గత ఐదు రోజులుగా టిమ్స్‌లో ఇదే పరిస్థితి ఉన్నట్టు చెబుతున్నారు. రోజూ పదుల సంఖ్యలో రోగులు ప్రాణాలు కోల్పోతున్నట్టు తెలుస్తోంది. నిన్న పటాన్‌చెరులోని ఓ ఆసుపత్రిలో ఐదుగురు కరోనా రోగులు మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments