కరోనాతో భారత్‌కు తిప్పలు.. యూఏఈ బ్యాడ్ న్యూస్.. ఏంటది?

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (11:04 IST)
కరోనా మహమ్మారితో భారత్‌కు తిప్పలు తప్పట్లేదు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో భారత్ నుంచి అన్ని విమానాలపై యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నిషేధం ప్రకటించింది. మన దేశం నుంచి వెళ్లే అంతర్జాతీయ సర్వీసుల్లో మెజార్టీ విమానాలు యూఏఈలోని దుబాయ్, షార్జా మీదుగా వెళ్లేవే కావడంతో తాజా నిషేధ నిర్ణయం మొత్తం విమానయాన రంగంపై ప్రతికూల ప్రభావం చూపనుంది. 
 
భారత్ నుంచి వచ్చే అన్ని విమానాలపై ఈ నెల 25 నుంచి పది రోజుల పాటు, అంటే, మే 5 వరకు నిషేధం విధిస్తున్నట్లు యూఏఈ విమానయాన శాఖ గురువారం ప్రకటించింది. ఒక్కవిమానాలపైనే కాదు, భారతీయ ప్రయాణికులపైనా యూఏఈ కఠిన ఆంక్షలు విధించింది. ఇతర దేశాల్లో 14 రోజులపాటు ఉండని భారతీయ ప్రయాణికులను కూడా (యూఏఈలోకి) అనుమతించబోమని తెలిపింది. 
 
అయితే, యూఏఈ నుంచి భారత్ కు వచ్చే సర్వీసులు, కార్గో రాకపోకలు కొనసాగుతాయని, యూఏఈ పౌరులు, దౌత్య అధికారులు, సిబ్బంది, వ్యాపార వేత్తల విమానాలకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చినట్లు యూఏఈ వెల్లడించింది. 
 
అయితే వీరంతా పది రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలని, వచ్చిన రోజుతోపాటు, తర్వాత 4, 8 రోజుల్లో పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని పేర్కొంది. ఈ కేటగిరి వ్యక్తుల ప్రయాణాలకు ముందుగా చేయించుకున్న కరోనా పరీక్ష గడువును 72 గంటల నుంచి 48 గంటలకు కుదించింది. కేవలం అనుమతించిన ల్యాబ్ రిపోర్టులను మాత్రమే అంగీకరిస్తామని ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments