సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసు - అవులకు రిమాండ్

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (15:31 IST)
సైనిక బలగాల నియామకం కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఈస్ట్ కోస్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అయితే, ఈ విధ్వంసానికి కారణం సాయి డిఫెన్స్ అకాడెమీ నిర్వహిస్తున్న ఆవులు సుబ్బారావు కారణమని పోలీసులు గుర్తించారు. దీంతో ఆయన్ను అరెస్టు చేశారు. 
 
సుబ్బారావుతో పాటు అతని ముగ్గురు అనుచరులు మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని శనివారం రైల్వే కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న రైల్వే న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు రైల్వే కోర్టు నుంచి సుబ్బారావుతో పాటు అతని అనుచరులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ విధ్వంసం కేసులో దాదాపు 40 మందికి పైగా నిందితులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అద్భుత డ్యాన్స్ టాలెంట్‌తో అదరగొట్టిన బాలయ్య చిన్న కుమార్తె (వీడియో)

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

తర్వాతి కథనం
Show comments