Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి.. పెరిగిపోతున్నాయ్

Webdunia
శనివారం, 17 అక్టోబరు 2020 (09:38 IST)
కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో తగ్గినట్లే తగ్గి వ్యాపిస్తోంది. తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్న కరోనా కేసులు కొద్ది రోజులుగా మళ్ళీ పెరుగుతున్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం శుక్రవారం 1,451 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,20,675 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో తొమ్మిది మంది మరణించారు. ఇప్పటివరకు 1265 మంది కరోనాతో మరణించారు.
 
ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 22,774గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 1,96,636 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 1,983 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
 
తెలంగాణాలో రికవరీ రేటు 89.1% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 87.7% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.57 %గా ఉన్నాయి. రాష్ట్రంలో శుక్రవారం 42,497 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 37,89,460 పరీక్షలు చేసారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా 235 కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments