Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు భాష కనుమరుగు కాకముందే రక్షించుకోవాలి : మంత్రి కిషన్ రెడ్డి

ఠాగూర్
సోమవారం, 6 జనవరి 2025 (16:03 IST)
తెలుగు భాష కనుమరుగు కాకముందే రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మాట్లాడటం, రాయడం ద్వారా భాషను పరిరక్షించుకోగలమన్నారు. అలాగే, కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యావిధానాన్ని ప్రతి ఒక్క రాష్ట్రం అమలు చేయాలని సూచించారు. వాడుక భాషలో 30 శాతమే తెలుగు ఉందని, 70 శాతం ఆంగ్ల పదాలే ఉన్నాయని, మనకు తెలియకుండానే తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ, మాట్లాడటం, రాయడం ద్వారానే భాషను పరిరక్షించగలమన్నారు. పిల్లలతో నిత్యం బాలసాహిత్యం చదివించాలన్నారు. తెలుగు భాష కనుమరుగు కాకముందే రక్షించుకోవాలన్నారు. తెలుగు భాషను బోధనా భాషగా ప్రాచుర్యంలోకి తేవాలన్నారు. 
 
పాలన, అధికార వ్యవహారాలు తెలుగు భాషలో జరగాలని సూచించారు. ప్రాథమికస్థాయి వరకు విద్య కూడా తెలుగులో ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ప్రాంతీయ భాషల పరిరక్షణకు పెద్దల సహకారం అవసరమన్నారు.
 
కోర్టుల్లో వాదనలు, ప్రతివాదనలు తెలుగులో ఉండాలని, కోర్టు తీర్పులు, సినిమాల పేర్లు తెలుగులోనే ఉండాలన్నారు. వికీపీడియాలో తెలుగు వ్యాసాలు రోజురోజుకు పెరుగుతున్నట్లు చెప్పారు. కథలు, వ్యాసాలు ఆడియోల రూపంలో అందుబాటులో ఉన్నాయన్నారు. తెలుగు భాషను డిజిటల్
 
విభాగంలోనూ క్రోఢీకరించి భావితరాలకు అందించాలన్నారు. డిజిటల్ రంగం పరంగానూ మాతృభాష అభివృద్ధి, సంరక్షణకు దోహదం చేయాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments