Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులపై దాడి.. ఖండించిన ఎండీ సజ్జనార్

సెల్వి
బుధవారం, 10 జనవరి 2024 (17:54 IST)
TSRTC
టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులపై దాడులు చేస్తే సహించేది లేదని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బుధవారం హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా అందోల్‌లోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద మంగళవారం ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌పై బైకర్‌ దాడి చేసిన ఘటనపై సజ్జనార్‌ స్పందించారు. 
 
ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నిబద్ధతతో, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్న టీఎస్‌ఆర్టీసీ సిబ్బందిపై ఇలా విచక్షణారహితంగా దాడులు చేయడం సమంజసం కాదు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగిందన్నారు. అయినా వారంతా ఎంతో ఓర్పుతో, సహనంతో విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఘటనలు సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు.
 
సంగారెడ్డి జిల్లా అందోల్‌లోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై అందోల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆవేశంతో సిబ్బందిపై దాడి చేసి అనవసరంగా ఇబ్బందులకు గురిచేయవద్దని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments