Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులపై దాడి.. ఖండించిన ఎండీ సజ్జనార్

సెల్వి
బుధవారం, 10 జనవరి 2024 (17:54 IST)
TSRTC
టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులపై దాడులు చేస్తే సహించేది లేదని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బుధవారం హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా అందోల్‌లోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద మంగళవారం ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌పై బైకర్‌ దాడి చేసిన ఘటనపై సజ్జనార్‌ స్పందించారు. 
 
ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నిబద్ధతతో, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్న టీఎస్‌ఆర్టీసీ సిబ్బందిపై ఇలా విచక్షణారహితంగా దాడులు చేయడం సమంజసం కాదు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగిందన్నారు. అయినా వారంతా ఎంతో ఓర్పుతో, సహనంతో విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఘటనలు సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు.
 
సంగారెడ్డి జిల్లా అందోల్‌లోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై అందోల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆవేశంతో సిబ్బందిపై దాడి చేసి అనవసరంగా ఇబ్బందులకు గురిచేయవద్దని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments