Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులపై దాడి.. ఖండించిన ఎండీ సజ్జనార్

సెల్వి
బుధవారం, 10 జనవరి 2024 (17:54 IST)
TSRTC
టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులపై దాడులు చేస్తే సహించేది లేదని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బుధవారం హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా అందోల్‌లోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద మంగళవారం ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌పై బైకర్‌ దాడి చేసిన ఘటనపై సజ్జనార్‌ స్పందించారు. 
 
ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నిబద్ధతతో, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్న టీఎస్‌ఆర్టీసీ సిబ్బందిపై ఇలా విచక్షణారహితంగా దాడులు చేయడం సమంజసం కాదు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగిందన్నారు. అయినా వారంతా ఎంతో ఓర్పుతో, సహనంతో విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఘటనలు సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు.
 
సంగారెడ్డి జిల్లా అందోల్‌లోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై అందోల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆవేశంతో సిబ్బందిపై దాడి చేసి అనవసరంగా ఇబ్బందులకు గురిచేయవద్దని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

Vijay: రష్మిక మందన్న బర్త్ డే వేడుకను ఓమన్ లో జరిపిన విజయ్ దేవరకొండ !

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments