Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ప్రొఫెసర్ కోదండరామ్!!

Webdunia
శుక్రవారం, 8 డిశెంబరు 2023 (12:56 IST)
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేత ప్రొఫెసర్ కోదండరామ్. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ఈ మాజీ ప్రొఫెసర్‌ గత తొమ్మిదేళ్లుగా ఎక్కడున్నారో తెలియదు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన పక్కనే పెట్టుకున్న కె.చంద్రశేఖర్ రావు.. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రొఫెసర్ కోదండరామ్‌తో పాటు అనేక మందిని పక్కనపెట్టేశారు. అయితే, ఇపుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి.. ప్రొఫెసర్ కోదండరామ్ సూచనలు, సలహాలు స్వీకరించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా కోదండరామ్‌ను నియమించే అవకాశాలు ఉన్నట్టు తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు చెబుతున్నారు. 
 
నిజానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్, కోదండరామ్‌లు పలు మార్లు కలిసి అనేక విషయాలపై చర్చించారు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీతో టేజీఎస్ పొత్తుపెట్టుకుంది. అయితే, ఎన్నికల్లో తాను పోటీ చేయనని కోదండరామ్ చెప్పడంతో ఆ పార్టీకి కాంగ్రెస్ ఒక్క సీటు కూడా కేటాయించలేదు. ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించడంతో కోదండరామ్‌ను ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవిని ఇవ్వనున్నట్టు వార్తలు  వస్తున్నాయి. కోదండరామ్ తన పక్కన ఉంటే సీఎంగా తాను సక్సెస్ కావడానికి ఆయన సలహాలు, సూచనలు దోపదపడతాయని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments