Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డుల పంపిణీ.. ముగ్గురి అరెస్ట్

సెల్వి
గురువారం, 20 జూన్ 2024 (11:47 IST)
తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాల అక్రమ సేకరణకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పట్టుకుంది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో వారి వద్ద నుంచి 113 సిమ్ కార్డులు, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. 
 
తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో సంక్లిష్టమైన సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌పై సమగ్ర దర్యాప్తును ప్రారంభించింది. ఈ క్రమంలో అంతర్జాతీయంగా దుబాయ్, థాయిలాండ్, కంబోడియా వంటి దేశాలలో సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాల హ్యాక్‌కు పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. 
 
అరెస్టయిన వారిలో జగద్గిరిగుట్టకు చెందిన షేక్ సుభాని (26), జీడిమెట్ల చింతల్‌కు చెందిన కె నవీన్ (22), ఎం ప్రేమ్ కుమార్ అలియాస్ మైఖేల్, ఆర్టీసీ ఎక్స్ రోడ్డుకు చెందిన మైక్ టిస్సన్ (24) ఉన్నారు. నిందితులు వివిధ వ్యక్తులు, సంస్థల గుర్తింపులను ఉపయోగించి సిమ్ కార్డులను సేకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సిమ్ కార్డులు సైబర్ నేరగాళ్లకు పంపడం జరిగిందని దర్యాప్తులో తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments