సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డుల పంపిణీ.. ముగ్గురి అరెస్ట్

సెల్వి
గురువారం, 20 జూన్ 2024 (11:47 IST)
తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాల అక్రమ సేకరణకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పట్టుకుంది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో వారి వద్ద నుంచి 113 సిమ్ కార్డులు, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. 
 
తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో సంక్లిష్టమైన సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌పై సమగ్ర దర్యాప్తును ప్రారంభించింది. ఈ క్రమంలో అంతర్జాతీయంగా దుబాయ్, థాయిలాండ్, కంబోడియా వంటి దేశాలలో సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాల హ్యాక్‌కు పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. 
 
అరెస్టయిన వారిలో జగద్గిరిగుట్టకు చెందిన షేక్ సుభాని (26), జీడిమెట్ల చింతల్‌కు చెందిన కె నవీన్ (22), ఎం ప్రేమ్ కుమార్ అలియాస్ మైఖేల్, ఆర్టీసీ ఎక్స్ రోడ్డుకు చెందిన మైక్ టిస్సన్ (24) ఉన్నారు. నిందితులు వివిధ వ్యక్తులు, సంస్థల గుర్తింపులను ఉపయోగించి సిమ్ కార్డులను సేకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సిమ్ కార్డులు సైబర్ నేరగాళ్లకు పంపడం జరిగిందని దర్యాప్తులో తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: పసుపు గౌనులో గోల్డెన్ బ్యూటీ అవార్డు గెలుచుకున్న తమన్నా భాటియా

Pooja Hegde :వర్షం, పర్వత ప్రాంత ప్రార్థనాల మధ్య దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే చిత్రం షూట్

Laya: జగపతి బాబు, లయల మధ్య ఫ్యామిలీ కెమిస్ట్రీ తో వదలా నుంచి మెలోడీ సాంగ్

Sunil : పుష్ప తర్వాత నా లైఫ్ సర్‌ప్రైజింగ్ మోడ్‌లో పడింది. : సునీల్

Manoj Manchu: సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్ ను స్వీకరించిన మనోజ్ మంచు

తర్వాతి కథనం
Show comments