Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో అనుమానాస్పదస్థితిలో తెలుగు విద్యార్థి మృతి!!

ఠాగూర్
సోమవారం, 23 డిశెంబరు 2024 (13:56 IST)
అగ్రరాజ్యం అమెరికాలో ఓ తెలుగు విద్యార్థి అనుమానాస్పదస్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడుని తెలంగాణలోని హన్మకొండ జిల్లా బండి వంశీగా గుర్తించారు. ఈ యువకుడు నివసించే నివాసం వద్దే అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించాడు. వంశీ నివాసం ఉంటున్న అపార్టుమెంట్‌లోని కారులో శవమై కనిపించాడు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులకు ఆదివారం నాడు సమాచారం వచ్చింది. 
 
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామానికి చెందిన గీతకార్మికుడు బండి రాజయ్య, లలిత దంపతుల రెండో కుమారుడు బండి వంశీ (25). గతేడాది జులైలో ఉన్నత చదువుల కోసం అమెరికాలోని మిన్నెసొటాకు వెళ్లాడు. అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తూ.. ఎంఎస్ చదువుతున్నాడు.
 
ఈ క్రమంలో అతడు ఉంటున్న అపార్టుమెంట్‌లోని సెల్లార్ పార్క్ చేసి ఉన్న ఓ కారు సీట్లో మృతి చెంది ఉండడం అదే అపార్టుమెంటులో ఉంటున్న హన్మకొండ జిల్లాకే చెందిన యువకులు ఆదివారం ఉదయం గుర్తించారు. వెంటనే వంశీ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కొడుకు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
 
ఈ ఘటన గురించి తెలుసుకున్న హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వొడితల ప్రణవ్ వంశీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేలా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానని వంశీ పేరెంట్స్కు ఆయన హామీ ఇచ్చారు. ఈ ఘటనతో మాదన్నపేట గ్రామంలో విషాదం అలుముకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments