Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనారోగ్యంతో మరణించిన బాలిక... టెన్త్ ఫలితాల్లో స్కూల్ టాపర్

ఠాగూర్
గురువారం, 1 మే 2025 (14:06 IST)
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం పదో తరగతి ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో స్కూల్ టాపర్‌గా నిలిచిన ఓ బాలిక... ప్రాణాలు కోల్పోయింది. ఈ ఫలితాల వెల్లడికి 13 రోజుల క్రితమే ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు గుండెలావిసెలా రోదిస్తున్నారు. ఈ విషాదకర ఘటన రాజన్న సిరిసిల్లా జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మల్లాపూర్ గ్రామానికి చెందిన ఆకుల రవి, రజిత అనే దంపతులకు ఆకుల నాగచైతన్య అనే కుమార్తె ఉండగా, అదే పాఠశాలలో పదో తరగతి విద్యాభ్యాసం చేస్తోంది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగిన పరీక్షల్లో ఉత్సాహంగా హాజరైంది. అలా పరీక్షలు పూర్తయిన 13 రోజులకు తీవ్ర అనారోగ్యానికి గురైంది.
 
చివరికి ఆరోగ్యం క్షీణించి పరిస్థితి విషమించడంతో ఏప్రిల్ 17వ తేదీన చనిపోయింది. అయితే, బుధవారం వెల్లడైన పరీక్షా ఫలితాల్లో ఆమె 600 మార్కులకుగాను 510 మార్కులు సాధించి స్కూల్ టాపర్‌గా నిలిచింది. కానీ, ఆ సంతోషాన్ని పంచుకునేందుకు తమ కుమార్తె లేకపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలావిసెలా రోదిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments