Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో మంగళవారం వెల్లడికానున్న టెన్త్ ఫలితాలు!!

వరుణ్
సోమవారం, 29 ఏప్రియల్ 2024 (13:18 IST)
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు మంగళవారం వెల్లడికానున్నాయి. ఆ దిశగా ఆ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలు ఆన్‌లైన్‌లో విడుదల చేసేలా ఏర్పాట్లుచేశారు. పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం కూడా అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. అయితే, ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈ ఫలితాలను మంత్రి విడుదల చేయడం లేదు 
 
ఇకపోతే, మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెల్సిందే. సుమారుగా 5.08 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 2,50,433 మంది బాలికలు, 2,57,952 మంది బాలురు ఉన్నారు. ఏప్రిల్ 13వ తేదీ నుంచి జవాబు పత్రాల మూల్యాంకన చేపట్టగా, ఈ ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ ఏర్పాటు చేసింది. ఈ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ https://results.bsetelangana.org లో చెక్ చేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments