Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో మంగళవారం వెల్లడికానున్న టెన్త్ ఫలితాలు!!

వరుణ్
సోమవారం, 29 ఏప్రియల్ 2024 (13:18 IST)
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు మంగళవారం వెల్లడికానున్నాయి. ఆ దిశగా ఆ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలు ఆన్‌లైన్‌లో విడుదల చేసేలా ఏర్పాట్లుచేశారు. పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం కూడా అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. అయితే, ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈ ఫలితాలను మంత్రి విడుదల చేయడం లేదు 
 
ఇకపోతే, మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెల్సిందే. సుమారుగా 5.08 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 2,50,433 మంది బాలికలు, 2,57,952 మంది బాలురు ఉన్నారు. ఏప్రిల్ 13వ తేదీ నుంచి జవాబు పత్రాల మూల్యాంకన చేపట్టగా, ఈ ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ ఏర్పాటు చేసింది. ఈ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ https://results.bsetelangana.org లో చెక్ చేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments