Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమలతో మాట్లాడిన ప్రియాంకా గాంధీ, కొండా సురేఖ రాజీనామా?

ఐవీఆర్
శనివారం, 5 అక్టోబరు 2024 (15:27 IST)
భారాస నాయకుడు కేటీఆర్ పైన వ్యాఖ్యానిస్తున్న క్రమంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగార్జున, చైతన్య, సమంతల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసారు. ఇవి కాస్తా తీవ్ర దుమారం రేపాయి. కేటీఆర్ కారణంగానే నాగచైతన్య-సమంత విడాకులు తీసుకున్నారని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు సురేఖ చెప్పారు. ఐతే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
 
అక్కినేని నాగార్జున సతీమణి అక్కినేని అమలతో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల తమ కుటుంబం తీవ్రంగా ఆవేదన చెందుతున్నామని ప్రియాంకతో అమల చెప్పినట్లు సమాచారం. దీనితో కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
 
ఐతే పదవి నుంచి నేరుగా ఆమెను తొలగించకుండా, కొండా సురేఖ తనంతట తానుగా రాజీనామా చేయాలని సమాచారం పంపినట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఏం జరుగుతుందో వేచి చూద్దాము.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments