Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమలతో మాట్లాడిన ప్రియాంకా గాంధీ, కొండా సురేఖ రాజీనామా?

ఐవీఆర్
శనివారం, 5 అక్టోబరు 2024 (15:27 IST)
భారాస నాయకుడు కేటీఆర్ పైన వ్యాఖ్యానిస్తున్న క్రమంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగార్జున, చైతన్య, సమంతల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసారు. ఇవి కాస్తా తీవ్ర దుమారం రేపాయి. కేటీఆర్ కారణంగానే నాగచైతన్య-సమంత విడాకులు తీసుకున్నారని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు సురేఖ చెప్పారు. ఐతే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
 
అక్కినేని నాగార్జున సతీమణి అక్కినేని అమలతో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల తమ కుటుంబం తీవ్రంగా ఆవేదన చెందుతున్నామని ప్రియాంకతో అమల చెప్పినట్లు సమాచారం. దీనితో కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
 
ఐతే పదవి నుంచి నేరుగా ఆమెను తొలగించకుండా, కొండా సురేఖ తనంతట తానుగా రాజీనామా చేయాలని సమాచారం పంపినట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఏం జరుగుతుందో వేచి చూద్దాము.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments