ముగిసిన ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన.... 11 విజ్ఞప్తులతో సీఎం రేవంత్ లేఖ

ఠాగూర్
మంగళవారం, 5 మార్చి 2024 (19:59 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన రెండు రోజుల పర్యటన మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ఈ పర్యటనలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అలాగే, మరికొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించారు. అలాగే, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన సంకల్ప సభలలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సోమవారం ఉదయం జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని మోడీ .. ఆ తర్వాత తమిళనాడు ప్యటనకు వచ్చారు. ఇది ముగించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకుని ఆ రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేశారు. బుధవారం ఉదయం తెలంగాణాలో అభివృద్ధి పనులకు శంకు స్థాపనలు చేశారు. పటేలగూడ సభ తర్వాత తిరిగి హైదరాబాద్‌కు చేరుకుని, అక్కడ నుంచి బేగంపేట విమానాశ్రయం నుంచి ఒడిశాకు బయలుదేరివెళ్లారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌లు తదితరులు ప్రధాన మోడీకి విడ్కోలు పలికారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి 11 విజ్ఞప్తులు చేశారు. కేంద్రం నుంచి సహకారం కావాలని కోరారు. హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ, అభివృద్ధి, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు అంశం, హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై అమ్రాబాద్ ఫారెస్ట్ ఏరియా మీదుగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఆర్థిక మద్దతు, ఎన్టీపీసీలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేంద్రం సహకారం, ఇంటింటికీ నల్లా, ఐపీఎస్ క్యాడర్ పెంపు, హైదరాబాద్  - రామగుండం, హైదరాబాద్ - నాగపూర్ రహదారిపై రక్షణ శాఖ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, భారత్ మాలలో తెలంగాణకు అధిక ప్రాధాన్యత, తెలంగాణాలో సెమీ కండక్టర్ల తయారీ తదిత అంశాల్లో కేంద్రం సహకారం అందించాలని సీఎం రేవంత్ చేసిన విజ్ఞప్తుల్లో ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అప్పట్లో ఎకరం 9 లక్షలకు అమ్మా, ఇప్పుడక్కడ ఎకరం 100 కోట్లు, ఏం చేస్తాం?: నటుడు శివాజీ

Chiranjeevi: పెద్ది చిత్రం రైరై రారా పాట లో చరణ్ కష్టానికి ఫలితం దక్కింది : మెగాస్టార్ చిరంజీవి

Laya: మా అమ్మాయి ఓటీటీలో సినిమా అనగానే ఎంతో బాధపడింది : లయ

Pooja : దోశ డైరీస్ పై మంచి కథలన్నీ నిర్మించాలని ఉంది.: పూజా శరత్ కుమార్

Manoj: డేవిడ్ రెడ్డి షూటింగ్‌తో మనోజ్ బిజీ - సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్న మౌనిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments