కేసీఆర్‌కు పెరిగిన షుగర్ లెవెల్స్... యశోద ఆస్పత్రిలో అడ్మిట్

ఠాగూర్
శుక్రవారం, 4 జులై 2025 (14:04 IST)
భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్నట్టుండి ఒక్కసారిగా షుగర్ లెవల్స్ పెరిగిపోగా, సోడియం స్థాయి మాత్రం పడిపోయాయి. దీంతో ఆయన స్వల్ప అస్వస్థతకు లోనుకావడంతో హుటాహుటిన హైదరాబాద్ నగరంలోని యశోద ఆస్పత్రికి తరలించి అడ్మిట్ చేశారు. అక్కడ ఆయనకు ప్రత్యేక వైద్యుల బృందం వైద్యం అందిస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం దృష్ట్యా కొద్ది రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. ఈ విషయం తెలిసిన భారాస కార్యకర్తలు, నేతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో కేసీఆర్ తనయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. 
 
సాధారణ వైద్య పరీక్ష కోసమే తన తండ్రి ఆస్పత్రిలో చేరారని తెలిపారు. ఆయన ఆరోగ్య సూచికలన్నీ సాధారణంగానే ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్న శ్రేయోభిలాషులకు, పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. కాగా, గత రెండు రోజులుగా నీరసంగా ఉండటంతో కేసీఆర్‌ను గురువారం సాయంత్రం యశోద ఆస్పత్రికి తరలించారు. ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు సూచన మేరకు ఆస్పత్రిలో చేర్పించి, వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక వైద్య పరీక్షల్లో కేసీఆర్ రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా, సోడియం స్థాయిలు తక్కువగా ఉన్నట్టు తేలిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments