Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురి తప్పింది... వందే భారత్ అద్దం పగిలింది

Webdunia
ఆదివారం, 31 డిశెంబరు 2023 (11:46 IST)
గుల్లేరు గురి తప్పింది. పిట్టను కొట్టబోతే వందే భారత్ రైలు అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జనగామలో జరిగింది. దీంతో ఈ ఘటనకు కారణమైన హరిబాబును అరెస్టు చేశారు. అయితే, తాను ఉద్దేశ్యపూర్వకంగా వందే భారత్ రైలు అద్దాన్ని పగలగొట్టలేదని, గుల్లేరు గురితప్పి వందే భారత్ రైలు అద్దానికి తగిలి పగిపోయిందని ఆయన వివరణ ఇచ్చినప్పటికీ ఖాజీపేట్ రైల్వే పోలీసులు మాత్రం వినిపించుకోలేదు. 
 
పోలీసు కథనం మేరకు.. జనగామకు చెందిన హరిబాబు (60) అనే వ్యక్తికి పిట్టలను కొట్టి, వాటిని ఆహారంగా తీసుకునే అలవాటు ఉంది. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం జనగామ సమీపంలో గుల్లేరుతో పిట్టలను కొట్టే క్రమంలో అది గురితప్పింది. అదే సమయంలో విశాఖపట్టణం నుంచి సికింద్రాబాద్ వెళుతున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును తాకింది. దీంతో ఆ రైలు అద్దం కాస్త పగిలిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో గుల్లేరుతో కొట్టింది హరిబాబేనని తేలింది. 
 
దీంతో ఆయనను శనివారం అరెస్టు చేశారు. ఆయన ఉపయోగించే గుల్లేరును కూడా స్వాధీనం చేసుకున్నారు. తన అరెస్టుపై హరిబాబు స్పందిస్తూ, తాను రైలుకు గురిపెట్టలేదని, పిట్టను కొట్టబోతే గురితప్పి... అది రైలును తాకిందని, ఇందులో తన తప్పేమి లేదని చెప్పాడు. అయితే, రైల్వే పోలీసులు మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా హరిబాబును అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments