గ్లోవ్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. మంటల్లో కాలిపోయిన కార్మికులు

Webdunia
ఆదివారం, 31 డిశెంబరు 2023 (11:24 IST)
మహారాష్ట్రంలోని ఛత్రపతి శంభాఝీ నగరంలో‌‍ ఆదివారం తెల్లవారు జామున్న గ్లోవ్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మంటల్లో చిక్కుకునిపోవడంతో వారు సజీవదహనమయ్యారు. వాలూజ్ ఎంఐడీసీ ప్రాంతంలో ఉన్న హ్యాండ్ గ్లోవ్స్ తయారీ కంపెనీలో ఆదివారం తెల్లవారు జామున 2.15 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగింది. 
 
భవనంలో చిక్కుకున్న తమ బంధువులను రక్షించేందుకు సహాయం కోసం ప్రజలు హాహాకారాలు చేస్తున్నట్లు ఆ ప్రాంతం నుంచి దృశ్యాలు చూపించాయి. ఈ అగ్నిప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవ దహనమయ్యారని ఫైర్ ఆఫీసర్ మోహన్ ముంగ్సే చెప్పారు.
 
రాత్రి కంపెనీ మూసి ఉందని, కంపెనీలో మంటలు చెలరేగాయని కార్మికులు చెప్పారు. మృతులను ఇంకా గుర్తించాల్సి ఉందని పోలీసులు చెప్పారు. మంటలు చెలరేగినప్పుడు భవనం లోపల 10-15 మంది ఉన్నారని, కొందరు తప్పించుకోగలిగారు. మరికొందరు ఇంకా లోపల అగ్నిప్రమాదంలో చిక్కుకున్నారని కార్మికులు తెలిపారు.
 
సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక యంత్రాలు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని భవనంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కంపెనీలో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments