Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్లోవ్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. మంటల్లో కాలిపోయిన కార్మికులు

Webdunia
ఆదివారం, 31 డిశెంబరు 2023 (11:24 IST)
మహారాష్ట్రంలోని ఛత్రపతి శంభాఝీ నగరంలో‌‍ ఆదివారం తెల్లవారు జామున్న గ్లోవ్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మంటల్లో చిక్కుకునిపోవడంతో వారు సజీవదహనమయ్యారు. వాలూజ్ ఎంఐడీసీ ప్రాంతంలో ఉన్న హ్యాండ్ గ్లోవ్స్ తయారీ కంపెనీలో ఆదివారం తెల్లవారు జామున 2.15 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగింది. 
 
భవనంలో చిక్కుకున్న తమ బంధువులను రక్షించేందుకు సహాయం కోసం ప్రజలు హాహాకారాలు చేస్తున్నట్లు ఆ ప్రాంతం నుంచి దృశ్యాలు చూపించాయి. ఈ అగ్నిప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవ దహనమయ్యారని ఫైర్ ఆఫీసర్ మోహన్ ముంగ్సే చెప్పారు.
 
రాత్రి కంపెనీ మూసి ఉందని, కంపెనీలో మంటలు చెలరేగాయని కార్మికులు చెప్పారు. మృతులను ఇంకా గుర్తించాల్సి ఉందని పోలీసులు చెప్పారు. మంటలు చెలరేగినప్పుడు భవనం లోపల 10-15 మంది ఉన్నారని, కొందరు తప్పించుకోగలిగారు. మరికొందరు ఇంకా లోపల అగ్నిప్రమాదంలో చిక్కుకున్నారని కార్మికులు తెలిపారు.
 
సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక యంత్రాలు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని భవనంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కంపెనీలో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

ఫస్ట్ టైమ్ హరుడు తో మాస్ చిత్రం చేశా : హీరో వెంకట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments