Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు బిడ్డలను నీటి బకెట్‌లో చంపేసిన తల్లి.. ఎక్కడ.. ఎందుకు?

Webdunia
ఆదివారం, 31 డిశెంబరు 2023 (10:41 IST)
ఓ కషాయి తల్లి తన ఇద్దరు పిల్లలను నీటి బకెట్‌లో ముంచి చంపేసింది. ఆపై తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని హాల్వీలో శనివారం ఈ విషాదకర ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హాల్వి గ్రామానికి చెందిన రామకృష్ణ, శారద దంపతులకు ఇద్దరు కుమారులు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న సమయంలో శారద తన ఇద్దరు కుమారులు వెంకటేశ్ (3), భరత్ (6 నెలలు)లను నీటి బకెట్‌లో ముంచింది. చిన్నారులు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో భర్తతో కలిసి వారిని ఆసుపత్రికి తీసుకెళ్లింది. అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. 
 
చిన్నారుల మృతదేహాల్ని శవ పరీక్ష నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుమారులను చంపినట్టు తెలిస్తే ఇంట్లోవారు తనను చంపేస్తారనే భయంతో శారద కూడా విషం సేవించింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చిన్నారులను చంపడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసినట్టు  ఎస్ఐ నరేంద్రకుమార్ రెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments