Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త హైబీపీ బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణం: తట్టుకోలేక భార్య ఆత్మహత్య

ఐవీఆర్
బుధవారం, 10 జనవరి 2024 (10:26 IST)
హైదరాబాద్ ధూల్ పేట పరిధిలో మంగళ్ హాట్ లో విషాదం చోటుచేసుకున్నది. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకున్నది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
రహీంపురకి చెందిన 36 ఏళ్ల అమన్ కుమార్ ధూల్ పేటకి చెందిన 31 ఏళ్ల అత్మితతో గత కొన్ని సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా వున్నారు. ఐతే గచ్చిబౌలిలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న అమన్ గత నెల 26 రాత్రి హైబీపీ వచ్చింది. దీనితో అతడికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. భర్త మరణంతో అస్మిత తీవ్ర మనస్థాపానికి గురైంది. 
 
గత పదిహేను రోజులుగా అతడి ఫోటోను ఎదురుగా పెట్టుకుని బాధపడుతూ వచ్చింది. ఆమెను పుట్టింటివారు తమ ఇంటికి తీసుకుని వచ్చారు. ఐతే భర్త మరణాన్ని తట్టుకోలేని అస్మిత నిన్న సాయంత్రం ఇంట్లో చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments