Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురుకులాల్లో ఆగని సిబ్బంది వేధింపులు - విద్యార్థినుల రోదన (Video)

ఠాగూర్
గురువారం, 12 సెప్టెంబరు 2024 (09:55 IST)
తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థినులకు ఉపాధ్యాయుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. నెలవారీ పీరియడ్స్ సమయంలో బాత్రూంలో స్నానం చేస్తుంటే ఆలస్యం ఎందుకు అవుతుందంటూ పీఈటీ ఉపాధ్యాయురాలు జ్యోత్స్న తమను వేధిస్తోందంటూ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. 
 
ముఖ్యంగా స్నానం చేస్తుంటే బాత్రూమ్ తలుపులు పగలగొట్టి లోనికి వచ్చి మొబైల్ ఫోనుతో వీడియో రికార్డు చేస్తూ కొడుతోందని వారు బోరున విలపిస్తూ చెప్పారు. తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థినులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి గిరిజన బాలికల సంక్షేమ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. 
 
పీఈటిని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో 500కు పైగా విద్యార్థినులు పాల్గొన్నారు. అలాగే, హాస్టల్ ప్రాంగణంలో కేవలం రెండు బాత్రూమ్స్ మాత్రమే ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేసారు. అలాగే, పీఈటీ టీచర్ కొట్టిన దెబ్బలను చూపిస్తూ బోరున విలపించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments