తెలంగాణ ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు : సీఎం రేవంత్ రెడ్డి

వరుణ్
గురువారం, 18 జనవరి 2024 (11:15 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఇందులో హెల్త్ కేర్ డిజిటలీకరణ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. డిజిటల్ హెల్త్ కార్డుల డేటా భద్రత, ప్రైవేసీని కాపాడుతామని హామీ ఇచ్చారు. 
 
ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అత్యాధునిక సాంకేతికత సహాయంతో నాణ్యమైన వైద్య సేవలను అందించనున్నామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ అత్యుత్తమ వైద్య సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పేదలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఇక అత్యుత్తమ వైద్య సేవలకు, సాఫ్ట్‌వేర్‌ సేవలకు హైదరాబాద్ నగరం రాజధానిగా ఉందన్నారు. ప్రపంచ వ్యాక్సిన్లు, ఔషధాల్లో 33 శాతం హైదరాబాద్ నగరంలోనే తయారవుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishwak Sen.: విశ్వక్ సేన్.. ఫంకీ థియేటర్ డేట్ ఫిక్స్

Pre-Wedding Show Review: హాయిగా నవ్వుకునేలా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. మూవీ రివ్యూ

కేజీఎఫ్ విలన్ హరీష్ రాయ్ ఇకలేరు

సింగర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా మారా, ది గర్ల్ ఫ్రెండ్ స్ఫూర్తినిచ్చింది - హేషమ్ అబ్దుల్ వహాబ్

NtR: ప్రశాంత్ నీల్ చిత్రం షెడ్యూల్ కు సిద్ధం అవుతున్న ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments