తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్‌ శాంతి స్వరూప్ కన్నుమూత

సెల్వి
శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (12:34 IST)
Shantiswaroop
తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్‌గా గుర్తింపు పొందిన శాంతిస్వరూప్ శుక్రవారం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నప్పటికీ పరిస్థితి విషమించి మృతి చెందారు.
 
నవంబర్ 14, 1983న దూరదర్శన్ ఛానల్‌లో న్యూస్ రీడర్‌గా తన కెరీర్‌ని ప్రారంభించిన ఆయన ఒక దశాబ్దం పాటు టెలిప్రాంప్టర్ సహాయం లేకుండా కేవలం పేపర్లు చూస్తూ వార్తలను అందించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. 2011లో పదవీ విరమణ చేసే వరకు వార్తలు చదవడం కొనసాగించారు. 
 
శాంతిస్వరూప్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు కూడా లభించింది. ఆయన మృతి పట్ల రాజకీయ నాయకులు, జర్నలిస్టులు సంతాపం తెలిపారు. టీవీ యాంకర్‌గా పనిచేసిన ఆయన భార్య రోజారాణి కొంతకాలం క్రితం మరణించారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments