Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

సెల్వి
బుధవారం, 9 జులై 2025 (21:33 IST)
తెలంగాణ వచ్చాక కేసీఆర్‌ పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కృష్ణలో నీళ్లు తెలంగాణలోకి వచ్చిన వెంటనే ఒడిసి పట్టాల్సింది. జూరాల నుంచే నీరు తీసుకుందామని చిన్నారెడ్డి ఆరోజు సూచన చేశారు. ఆ రోజే చిన్నారెడ్డి మాట కేసీఆర్‌ వినిఉంటే నీళ్ల దోపిడి జరిగేది కాదు. చిన్నారెడ్డి సౌమ్యుడు కాబట్టి ఏం మాట్లాడలేదు. ఈ ద్రోహానికి కేసీఆర్‌ను వంద కొరడా దెబ్బలు కొట్టాలి. మేం సరిదిద్దుతుంటే తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు చేసి మాపై నిందలు మోపుతున్నారని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. 
 
కృష్ణా పరివాహక ప్రాంతంలోని రైతులకు మరణశాసనం రాసే అధికారం కేసీఆర్‌కు ఎవరూ ఇవ్వలేదన్నారు. జగన్‌ను పిలిచి సలహాలు ఇచ్చి, జీవోలు వచ్చేలా కేసీఆర్‌ సహకరించారు. కృష్ణానదిలో కేసీఆర్‌ చేసిన ద్రోహం ఉమ్మడి రాష్ర్టంలో సీమాంధ్ర పాలకుల కంటే వెయ్యిరెట్లు ఎక్కువ, తెలంగాణ జాతిపిత అని చెప్పుకునే కేసీఆర్‌ తెలంగాణకు ద్రోహం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
 
జగన్‌, కేసీఆర్‌ మధ్య ఏముంది అనేది అసవసరం. బేసీన్లు లేవు, బేషజాలు లేవని కేసీఆర్‌ ఎట్ల అంటాడు. చర్చ చేద్దామంటే సభకు రాడు. కేసీఆర్‌ హయాంలో 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తే పెండింగ్‌లో ఉన్న ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు. చేవేళ్ల పేరు పెట్టి నీళ్లు ఇవ్వకపోతే నిలదీస్తారని పేరు మార్చారు. 11 ఏఐబీపీ ప్రాజెక్టులను కేసీఆర్‌ ముట్టుకోలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments