Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు!!

ఠాగూర్
ఆదివారం, 2 జూన్ 2024 (12:10 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానానికి స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఉప ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి చెందిన అభ్యర్థి విజయం సాధించారు. మే నెల 28వ తేదీన ఈ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరగ్గా, జూన్ రెండో తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. ఈ లెక్కింపులో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి 109 ఓట్ల తేడాతో విజయభేరీ మోగించారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఐదు టేబుళ్లపై ప్రారంభమైన ఓట్ల లెక్కింపు పది గంటలకు ముగిసినట్టు ప్రకటించారు. 
 
కాగా, ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తంగా 1439 ఓటర్లు ఉన్నారు. ఇందులో ఇద్దరు మినహా అందరూ ఓటు వేశారు. వీటిలో చెల్లని ఓట్లు 21, మిగిలిన వాటిలో నవీన్ కుమార్ రెడ్డికి 762, కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డికి 653 ఓట్లు పోలయ్యాయి. దీంతో నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందినట్టుగా ఎన్నికల సంఘం అధికారకంగా ప్రకటించింది. 
 
మరోవైపు, ఈ ఎన్నికల్లో గెలుపొందిన నవీన్ కుమార్‌కు పార్టీ పరంగా సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా అభినందనులు తెలిపారు. పాలమూరు నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. ఆయన గెలుపునకు కృషి చేసిన భారాస ప్రజా ప్రతినిధులకు, కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments