బీఆర్ఎస్‌కి బిగ్ షాక్, మరో వికెట్ డౌన్, కేసీఆర్ 'కారు'ను హస్తం ఫినిష్ చేస్తుందా?

ఐవీఆర్
శనివారం, 13 జులై 2024 (20:55 IST)
బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీలో మరో వికెట్ పడిపోయింది. పఠాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. శనివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను కలిసారు. మరికొద్దిసేపట్లో ఆయన సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. 
 
మహిపాల్ రెడ్డి చేరికతో భారాస నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారి సంఖ్య 10కి చేరుకుంది. దీనితో సభలో 29 సభ్యులు బలం వున్న భారాస బలం 19కి పడిపోయింది. మరో పది మంది భారాస ఎమ్మెల్యేలను పార్టీ నుంచి లాగేస్తే కారు ఖతం అయిపోతుంది. భారాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకునే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
 
మరోవైపు పార్టీని వీడి వెళ్లిపోతున్న ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ఏకంగా కేసీఆర్ రంగంలోకి దిగినప్పటికీ ఫలితం కనిపించడంలేదు. ఈ వలసలు ఇలాగే సాగితే తెలంగాణలో కారు కనుమరుగు అయ్యే అవకాశం లేకపోలేదు. మరి ఈ ఉపద్రవాన్ని భారాస అధినేత కేసీఆర్ ఎలా అడ్డుకుంటారో వేచి చూడాల్సిందే.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments