Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో 18 నుంచి పదో తరగతి పరీక్షలు - విద్యాశాఖ కీలక నిర్ణయం

ఠాగూర్
ఆదివారం, 17 మార్చి 2024 (13:47 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 18వ తేదీ సోమవారం నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీ వరకు జరుగుతాయి. ఈ పరీక్షల నేపథ్యంలో ఆ రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షా కేంద్రానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వస్తే లోనికి అనుమతించబోమన్న నిబంధనను ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే, ప్రశ్నపత్రంలోని ప్రతి పేజీపై హాల్ టిక్కెట్ ఖచ్చితంగా రాయాలన్న నిబంధన విధించింది.
 
కాపీయింగ్, మాస్ కాపీయింగ్ పాల్పడితే డీబార్ తప్పదని హెచ్చరించింది. కాపీయింగ్ విషయంలో సిబ్బంది పాత్ర ఉన్నా చర్యలు తప్పవని కరాఖండిగా తేల్చి చెప్పింది. ప్రశ్నపత్రం చేతికి ఇవ్వగానే విద్యార్థులు తొలుత ప్రశ్నపత్రంలోని ప్రతి పేజీపై హాల్ టిక్కెట్ నంబర్ విధిగా రాయాలని ఆదేశించింది. ప్రశ్నపత్రాలు తారుమారు కాకుండా ఉండేందుకు, కాపీయింగ్‌కు వీలు లేకుండా ఉండేందుకు వీలుగా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు, ఇప్పటివరకు అమలులో ఉన్న ఐదు నిమిషాల నిబంధనను తొలగించింది. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తామని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments