Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో 18 నుంచి పదో తరగతి పరీక్షలు - విద్యాశాఖ కీలక నిర్ణయం

ఠాగూర్
ఆదివారం, 17 మార్చి 2024 (13:47 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 18వ తేదీ సోమవారం నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీ వరకు జరుగుతాయి. ఈ పరీక్షల నేపథ్యంలో ఆ రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షా కేంద్రానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వస్తే లోనికి అనుమతించబోమన్న నిబంధనను ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే, ప్రశ్నపత్రంలోని ప్రతి పేజీపై హాల్ టిక్కెట్ ఖచ్చితంగా రాయాలన్న నిబంధన విధించింది.
 
కాపీయింగ్, మాస్ కాపీయింగ్ పాల్పడితే డీబార్ తప్పదని హెచ్చరించింది. కాపీయింగ్ విషయంలో సిబ్బంది పాత్ర ఉన్నా చర్యలు తప్పవని కరాఖండిగా తేల్చి చెప్పింది. ప్రశ్నపత్రం చేతికి ఇవ్వగానే విద్యార్థులు తొలుత ప్రశ్నపత్రంలోని ప్రతి పేజీపై హాల్ టిక్కెట్ నంబర్ విధిగా రాయాలని ఆదేశించింది. ప్రశ్నపత్రాలు తారుమారు కాకుండా ఉండేందుకు, కాపీయింగ్‌కు వీలు లేకుండా ఉండేందుకు వీలుగా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు, ఇప్పటివరకు అమలులో ఉన్న ఐదు నిమిషాల నిబంధనను తొలగించింది. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తామని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments