Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో 'పొలిటికల్ బాహుబలి' రిలీజ్: 45 రోజుల్లో రూ. 709 కోట్లు వర్షం

Webdunia
సోమవారం, 27 నవంబరు 2023 (13:47 IST)
తెలంగాణలో నవంబర్ 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను లోబరుచుకునేందుకు ఆయా పార్టీలు నగదు, మద్యం, ఉచితాలు... కుమ్మరిస్తున్నాయి. కేవలం 45 రోజుల్లో ఎన్నికల సంఘానికి పట్టుబడిన ఉచితాలు, నగదు విలువ రూ. 709 కోట్లు దాటింది. ఇలా నగదు భారీగా పట్టుబడుతుండటంతో.. బాహుబలి సినిమా కలెక్షన్లకు మించి నగదు పట్టుబడుతుందేమోనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నవంబర్ 25న ఒక్కరోజే ఏకంగా రూ. 10 కోట్లు పట్టుబడ్డాయి. తాజాగా ఖమ్మం, పెద్దపల్లిలో రూ. 11 కోట్లకు పైగా నగదు పట్టుబడింది. పాలేరులో చేపట్టిన తనిఖీల్లో రూ. 3.5 కోట్లు నగదు పట్టుబడగా ఆ క్యాష్ ప్రధాన పార్టీలకు చెందినదిగా భావిస్తున్నారు.
 
మరోవైపు ఉచితాల తాయిలాలతో తెలంగాణ రోడ్లపై మినీలారీలు రయ్యమంటూ వెళ్తున్నాయి. వాటిలో మిక్సీలు, చీరలు, వాచీలు, మొబైల్ ఫోన్లు... ఇలా పలు వస్తువులు వున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద తెలంగాణలో ఓటర్లకు గాలం వేసేందుకు అన్ని పార్టీలు ఇలా తాయిలాలతో కుస్తీలు పడుతున్నాయి. మరి తెలంగాణ ఓటర్లు ఎవరికి పట్టం కడతారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah break up:తమన్నా భాటియా, విజయ్ వర్మల డేటింగ్ కు పాకప్ ?

Varalakshmi: కొంత ఇస్తే అది మళ్ళీ ఫుల్ సర్కిల్ లా వెనక్కి వస్తుంది: వరలక్ష్మీ, నికోలయ్‌ సచ్‌దేవ్‌

Tuk Tuk: సూపర్‌ నేచురల్‌, మ్యాజికల్‌ పవర్‌ ఎలిమెంట్స్‌ సినిమా టుక్‌ టుక్‌

కథ, కథనాల మీదే నడిచే సినిమా రా రాజా చూసి సక్సెస్ చేయాలి: దర్శకుడు బి. శివ ప్రసాద్

నేను చెప్పింది కాకపోతే ఇకపై జడ్జిమెంట్ ఇవ్వను : రాజేంద్రప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments