Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్ర ఫలితాల ఎఫెక్ట్ : రేవంత్‌ రెడ్డిని కలిసి డీజీపీ, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు

Webdunia
ఆదివారం, 3 డిశెంబరు 2023 (14:00 IST)
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఆదివారం ఉదయం నుంచి వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందనే సంకేతాలు తేటతెల్లం చేశాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర డీజీవీ అంజని కుమార్ యాదవ్ ఇతర పోలీస్ ఉన్నతాధికారులు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. 
 
ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరిగింది. ఆదివారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. ఈ లెక్కింపులో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని తేలిపోయింది.దీంతో రేవంత్ రెడ్డిని కలిసేందుకు పార్టీ నేతలు క్యూ కడుతున్నారు. తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ యాదవ్, తన సహోద్యోగులతో కలిసి రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకుని, ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చిచ అభినందనలు తెలిపారు. రేవంత్‌ను కలిసిన వారిలో సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ కూడా ఉన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
మరోవైపు, ఓట్ల లెక్కింపు ఉదయం 10 గంటల నుంచి మొదలుకాగా, రేవంత్ రెడ్డి ఇంటికి ఉదయం పది గంటల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు పోటెత్తారు. కార్యకర్తల తాకిడి నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకుని భద్రతను పెంచారు. మొత్తం 119 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 70కి పైగా సీట్లను కైవసం చేసుకోనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇక్కడ ఫస్ట్ షూటింగ్ చేసేది నా సినిమానే: మెగాస్టార్ చిరంజీవి

ఫాదర్స్‌ సూసైడ్‌ స్టోరీతో బాపు సినిమా : బ్రహ్మాజీ

పవన్ కల్యాణ్ పెద్ద స్థాయికి వెళతారని పంజా టైమ్‌లోనే అర్థమైంది : డైరెక్టర్ విష్ణు వర్ధన్

కొత్తదనం కావాలనుకునే వారు తల సినిమా ఆనందంగా చూడవచ్చు : అమ్మరాజశేఖర్

రాజా మార్కండేయ ట్రైలర్ లో మంచి కంటెంట్ వుంది : సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ పర్యటన: తాజా ఫ్యాషన్ ప్రపంచంలోకి ద వన్ అండ్ వోన్లీ

ఆఫ్రికా హృదయం నుండి ఆయుర్వేద జ్ఞానం వరకు: మరువా x సరితా హండా

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

భారతదేశంలో విక్టోరియా సీక్రెట్ 11వ స్టోర్‌ను ప్రారంభించిన అపెరల్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments